శ్రీ శివ సాయి రామయోగేంద్ర హనుమత్ క్షేత్రం అనునది దైవ సంకల్పం చే నిర్మింపబడిన శక్తివంతమైన క్షేత్రం ..
ఈ క్షేత్రం మేడూరు గ్రామం , గంపలగూడెం మండలం, N.T.R జిల్లా నందు కలదు.. సువిశాల పచ్చని తోటల మధ్యన ప్రకృతి ఒడిలో గల ఈ క్షేత్రం ఆవిర్భావం వెనుక మహత్తరమైన స్థల పురాణం కలదు
స్థల పురాణం
శ్రీ శివ సాయి రామాయొగేంద్ర హనుమత్ క్షేత్రమనునది దైవ సంకల్పముచే నిర్మించబడిన శక్తివంతమైన క్షేత్రం. ఈ క్షేత్రము కొలువైఉన్న మేడూరు గ్రామము, గంపలగూడెం మండలం ప్రస్తుతము యన్.టి.ఆర్. జిల్లా నందు కలదు. సువిశాల పచ్చని తోటల మద్యన ప్రకృతిలో ఉన్న ఈ క్షేత్రం భగవత్ స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ రామయోగేంద్ర స్వామివారి సంకల్పానికి రూపం.
సద్గురు రామయోగేంద్ర స్వామి వారు హిమాలయాలలో, మానస సరోవరంలో, బదరీనాధ్ కేదార్నాధ్ వంటి అనేక తపొ భూములలో దశాబ్దాల కొలది తపస్సునాచరించి శ్రీరామ సాక్షాత్కారము పొందిన తపస్సంపన్నులు. వారు తదనంతర కాలములో దేశ పర్యటనలో భాగంగా గ్రామ గ్రామాలలో తమ ఆధ్యాత్మిక శక్తితో సనాతన ధర్మ స్థాపన చేస్తూ సుమారు 1975వ సం.లో మేడూరు గ్రామములొ కొలువైయున్న శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించి అక్కడ అఖండ హరేరామ నామ సప్తాహములు ప్రారంభించి అఖండ జ్యోతిని వెలిగించారు.
వారు ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా ఒక చోట వారు స్థాణువై నిలబడిపోయారు. భక్తులందరూ ఏమైనది స్వామీ? అని అడుగగా, అడుగగా నేను నుంచున్న ఈ స్థలం క్రింద పూర్వపు యుగాలలో ఒక మహా స్వర్ణ శివాలయం అనంత నాగ శేషుడు కొలువై ఉండేవారని, స్వామివారు సెలవిచ్చారు. వారు ఈ స్తలము భవిష్యత్తులో ఒక మహా క్షేత్రంగా వెలసిల్లి భక్తులకు ఆ పరమేశ్వరుడు కోరిన కోర్కెలను ముక్తిని ప్రసాదిస్తాడు అని వివరించారు. ప్రస్తుతం శ్రీ శివ సాయి రామయోగేంద్ర హనుమత్ క్షేత్రము కొలువై ఉన్నది ఆ ప్రదేశేమే.
మహాత్ముల వాక్కు దైవ శాసనం అన్నట్లు తదనంతర కాలంలో వారి కనిష్ట పుత్రులు శ్రీ జానకి రామ శర్మగారు వారి తండ్రిగారు చూపిన బాటలోనే జీవనం సాగించి శ్రీ పంచముఖ హనుమత్ ఉపాసకులై శిష్యులచే దీక్షానామంగా దివ్యశ్రీ చిన రామయోగేంద్ర స్వామి వారుగా కీర్తించ బడి మేడూరు గ్రామములోనే 2000 సం.నందు శ్రీ రామయోగేంద్ర స్వామి వారి ఆశయాలను వ్యాప్తి చేయుటకు ఆశ్రమము స్థాపించుకొని స్థిర నివాసము ఏర్పరచుకున్నారు. తదనంతరం “ శ్రీ పంచానన విరాడ్రూపి అష్టాదశ భానువార హనుమత్ దీక్షా పీఠము” ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి హనుమత్ దీక్షలను అందించి హనుమత్ చాలీసాను రాష్ట్రం నలుమూలలా వ్యాప్తి చెందించారు. ఆద్యాత్మిక వెలుగులు నింపారు.
శ్రీ కాత్యాయిని సమేత జీవన్ముక్తేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం:-
దివ్యశ్రీ చిన రామయోగేంద్ర స్వామి వారు వారి తండ్రిగారు దైవ స్వరూపులు ఐన శ్రీ రామయోగేంద్ర స్వామి వారు సంకల్పమును కార్య రూపంలోనికి సిద్దించుటకు శివాలయ నిర్మాణమును సంకల్పించారు.
దేవాలయం నిర్మించే స్థలం అత్యంత శక్తివంతమైనదిగా మరియు పవిత్ర మైనదిగా ఉండాలని భావించిన స్వామివారు ఆ ప్రదేశము నందు నిర్విరామంగా 2000-2001 సం.లో 108 రోజులపాటు “మహా మృత్యుంజయ జప, పాశుపత దోస యజ్ఞమును మరియు దానిలో భాగంగా మహా రుద్రయాగం, అతి రుద్రయాగం, సహస్ర చండీ యాగం, శ్రీ లక్ష్మి నారాయణ యాగం, శ్రీ లక్ష్మి గణపతి యాగం వంటి ఉత్కృష్ట యాగములు నిర్వహించి 108 రోజులు నిరాటంకముగా మహా అన్నదానములు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించిన అత్యంత పవిత్ర స్థలమునందు దేవాలయ శంఖు స్థాపన జరిగింది.
అక్కడ నుండి కొన్ని సంవత్సరాల పాటు అనేక మంది భక్తుల శిష్యుల సహాయ సహకారములతో నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ దేవాలయం నిర్మాణం జరిగినది. ఈ క్షేత్రమునకు చిన్న స్వామి వారి ఉపాసనా దేవత ఐన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్టించారు.
శ్రీ ఆది శంకరాచార్యులు స్థిరపరచిన పంచాయతన విధానములో శ్రీ కాత్యాయిని సమేత జీవన్ముక్తేశ్వర స్వామి వారు ది.14-02-2009 న వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య దైవ సంకల్పముచే సుముహూర్తములో ప్రతిష్ట జరిపించుకున్నారు. మన దేవాలయములో గల దేవతా మూర్తుల ప్రతిష్ట కార్యక్రమములో మరలా 2009 సం.లో గురువర్యుల ఆలోచన మేరకు రెండవ సారి “విశ్వ శాంతియుత మాహా మృత్యుంజయ జప పాశుపత మహా రుద్రయాగ సహిత సహస్ర చండీయాగము” ను జరిపారు. ఆ మహా యాగములో 108 రోజుజు అనేక ఉప యాగములు జరిపారు.
ఆ ఉప యాగములు
1) లక్ష్మీ గణపతి యాగము,
2) నక్షత్ర యాగము,
3) లక్ష్మి నారాయణ యాగము,
4) నవ దుర్గా యాగము,
5) సౌర యాగము,
6) గాయత్రీ యాగము,
7) పుత్ర కామేష్టి యాగము,
8) పంచముఖీ హనుమత్ యాగము,
9) రుద్ర యాగములు,
10) చండీ యాగములు, మరెన్నో కలవు.
అన్నీ యాగములు జరిపి అఖండ ఆధ్యాతిక శక్తిని, దైవ శక్తిని ఆ క్షేత్రము నందు పొదుపరిచారు.
ఆలయ నిర్మాణం – విశిష్టత
శ్రీ కాత్యాయిని సమేత జీవన్ముక్తేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ చక్ర మేరువు ఆకారంలో నవా వరణములతో నిర్మించ బడిన ఆలయం.
ఈ తొమ్మిది ఆవరణములలో దర్శించినంత మాత్రము చేత సకల సంపదలు శుభాలు అందించే సాక్షాత్తు శివుని ఆత్మ లింగముగా భావించే నర్మద బాణ లింగములు 1116 ను 1116 మంది పుణ్య దంపతులచే వాయు ప్రతిష్ట చేయించారు.
నర్మద బాణ లింగము విశిష్టత
మట్టి, స్పటికం, బంగారం, వెండి తదితర శివలింగాలను పూజించడం వలన కలిగే పుణ్యఫలం, ఒక్క నర్మదా బాణ లింగాన్ని పూజించడం వలన లభిస్తుందని చెప్పబడుతోంది. నర్మదా బాణలింగాన్ని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయనీ, సుఖ సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది. సాలగ్రామములు ఏ విధంగా పూజలు అందుకుంటున్నవో నర్మద యందలి శిలలు, త్రినేత్రముల, యజ్ఞోపవీతముల చిహ్నములతో నర్మదబాణములుగా ప్రసిద్ధి పొంది శిష్టుల పూజా పీఠములను శివ స్వరూపంతో అలంకరిస్తున్నాయి. "గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు" పై శ్లోకంలో ఉన్న ఏడు నదుల పేర్లు స్మరించుకోవాలని మన పెద్దలు చెబుతారు. బృహదీశ్వరాలయంలోని అతిపెద్ద బాణలింగం ఇక్కడ లభించిందే. పూజా పీఠములను శివ స్వరూపంతో అలంకరిస్తున్నాయి.
ఈ ఆలయం రెండు అంతస్తులుగా నిర్మించబడి ఉన్నది
పైన అంతస్తులో పంచాయతన విధానంగా సూర్య, గణపతి, అంబిక నారాయణ సహిత పంచభూతాలను శాసించగల శ్రీ పంచముఖేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. ఈ శివ పంచాయతనంలో
1) శివుడు - జలము
2) అంబిక - వాయువు
3) గణపతి - ఆకాశం
4) విష్ణువు - భూమి
5) సూర్యుడు - అగ్నికి ప్రతీకలు
ఈ దేవాలయం పై అంతస్తులో నాలుగు ఉపాలయాలతో కూడి పంచముఖేశ్వరుడుప 5 ముఖాలతో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ 5 ముఖాలు
(1) సద్యోజాత ముఖం
(2) వామదేవ ముఖం
(3) అఘోర ముఖం
(4) తత్పురుష ముఖం
(5) ఈశాన ముఖం.
ఈ దేవాలయ క్రింది అంతస్తులో దేవాలయ అంతరాన శ్రీ కాత్యాయిని సమేత జీవన్ముక్తేశ్వర స్వామివారు చుట్టూ అష్ట శక్తులను పరివారంగా కొలువై ఉన్నారు.
శ్రీ కాత్యాయిని సమేత జీవన్ముక్తేశ్వర స్వామివారి విశిష్టత
మన దేవాలయంలో కొలువై ఉన్న జీవన్ముక్తేశ్వర స్వామి వారు “ లింగోద్భవ లింగ రూపంలో కొలువై ఉన్నారు. ఈ లింగ రూపము మక్కపేట గ్రామము నుండి దివ్య శ్రీ చిన రామయోగేంద్ర స్వామివారు తీసుకొని వచ్చారు. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ లింగము చోళుల లేదా కాకతీయుల కాలం నాటిదని అంచనా.
లింగోద్భవ రూపం విశిష్టత
శ్రీ కాత్యాయిని సమేత జీవన్ముక్తేశ్వర స్వామి వారి తంరాలయం చుట్టూగల అష్ట శక్తిరూపాలు